వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి..
Ens Balu
4
కలెక్టరేట్
2020-10-16 20:29:09
విజయనగరం జిల్లాలో: వక్ప్ బోర్డుకి సంబంధించిన భూములను, ఇతర ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని సంయుక్త కలక్టరు (ఆసరా) జె. వెంకటరావు అన్నారు. శుక్రవారం ఆయన చాంబరులో జిల్లా స్ధాయి వక్ప్ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ప్ భూములను సర్వే చేసి అన్యాక్రాంతమైన భూములు పరిరక్షించడానికి రెవిన్యూ, మున్సిపల్ కమిషనర్లు, సర్వే శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తులు 22 (ఎ) (1) (సి) జాబితాలో ఉన్న వాటిని వేరొకరి పేరున బదిలీ చేయరాదని జిల్లా రిజిస్ట్రార్ కు సూచించారు. అదేవిధంగా ఆ భూములకు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ నుండి ఎటువంటి ఫ్లాన్ అనుమతులు ఇవ్వరాదన్నారు. వక్ప్ భూములలో ఆదాయం వచ్చే కార్యక్రమాలకు, భూములను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా వినియోగించాలని అన్నారు. బకాయిపడ్డ నిధులను వెంటనే వసూలు చెయ్యాలని, వక్ప్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలన్నారు. అన్యాక్రాంతం యైన వాటిల్లో ఎక్కువగా శ్మశానాలు ఉన్నాయని, వక్ప్ ఆస్తులు పరిరక్షణకు ఆన్యాక్రాంతం చేసిన వారికి నోటీసులు జారీచెయ్యాలని, పరిరక్షణ కోసం బోర్డులను ఏర్పాటు చెయ్యాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం. గణపతిరావు, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎం. అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, జిల్లా రిజిస్ట్రార్ బాలకృష్ణ, వక్ప్ ఇన్స్పెక్టర్ సిద్దిఖి, పోలీస్, ఆర్ అండ్ బి, రెవిన్యూ, దేవాదాయ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.