కోవిడ్ పరీక్షలు మరిన్ని చేపట్టాలి..
Ens Balu
4
వీఎంఆర్డీఏ కార్యాలయం
2020-10-16 20:33:57
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపల్, డిఎంహెచ్ఓ లతో జిల్లాలో కోవిడ్-19 పరీక్షల నిర్వహణపై విఎంఆర్డిఏ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ.ఇ.సి. యాక్టివిటీలను అధికంగా పెంచాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో మరింత దృష్టి సారిస్తూ కోవిడ్ కేసులు అధికంగా ఉన్న మండలాలల్లో ఈ విషయంపై శ్రద్ద వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐవిఆర్ఎస్ ప్రజాభిప్రాయంను పరిశీలిస్తూ లోపాలను సరిచేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంఎంసి ప్రిన్సిపల్ పి.వి. సూధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.ఎస్. సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.