పరిమిత భక్తులతోనే పైడితల్లమ్మ సిరిమానోత్సవం..


Ens Balu
4
కలెక్టరేట్
2020-10-16 20:41:52

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తూనే, సంప్ర‌దాయాల ప్ర‌కారం శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తామ‌ని సిరిమాను ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై వివిధ శాఖ‌ల అధికారులు,  స్థానిక హుకుంపేట వాసుల‌తో త‌న కార్యాల‌యంలో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. సిరిమానుతోపాటుగా, పాల‌ధార‌, బెస్తవారి వ‌ల‌, ఏనుగు ర‌థం, అంజ‌లి ర‌థం త‌దిత‌ర ఘ‌ట్టాలు, సంప్ర‌దాయ వేడుక‌ల్లో పాల్గొనే భ‌క్తుల సంఖ్యపై ఆరా తీశారు. ఈ ర‌ధాలవ‌ద్ద ఉండే భ‌క్తుల‌ను క‌నీస సంఖ్య‌కు ప‌రిమితం చేయాల‌ని కోరారు.  పాల్గొనే ప్ర‌తీఒక్క‌రికీ ముందుగానే కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. వీటికి 20 లోపు వారిని, 60 ఏళ్లు పైబ‌డిన వారినీ ఎట్టిప‌రిస్థితిలోనూ అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. పాల్గొనే వారంద‌రి పేర్ల‌ను, ఆధార్ కార్డుల‌ను ముందుగానే అందించాల‌ని, వాంద‌రికీ త్వ‌ర‌లో రెండుమూడు రోజుల్లో కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ప్ర‌తీఒక్క‌రూ మాస్కుల‌ను ధ‌రించాల్సిందేన‌ని   స్ప‌ష్టం చేశారు. కౌంట‌ర్ల‌వ‌ద్ద ర‌ద్దీని త‌గ్గించేందుకు ద‌ర్శ‌నాల‌కు ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టనున్న‌ట్లు ఆర్‌డిఓ తెలిపారు. విజ‌య‌న‌గ‌రం డిఎస్‌పి వీరాంజ‌నేయ‌రెడ్డి మాట్లాడుతూ భ‌క్తుల మ‌నోభావాల‌ను తాము గౌర‌విస్తామ‌ని,  అయితే ఉత్స‌వాల‌కు వ‌చ్చే ప్ర‌తీ భ‌క్తుడూ కోవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు.  ఒకేచోట వేలాదిమంది చేరితో, ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కోవిడ్ మ‌ళ్లీ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఇదే జ‌రిగితే జిల్లా యంత్రాంగానికి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని, దీనిని దృష్టిలో ఉంచుకొని, ప్ర‌తీఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో ప‌లు ర‌కాల‌ నిబంధ‌న‌ల‌ను పెడుతున్నామ‌ని, వాటిని స‌హృదయంతో అర్ధం చేసుకోవాల‌ని డిఎస్‌పి కోరారు.   ఈ స‌మావేశంలో శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌స్థానం ఇఓ సుబ్ర‌మ‌ణ్యం, ప్ర‌ధాన పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు, తాశీల్దార్ ప్ర‌భాక‌ర్‌, దేవ‌స్థానం సిబ్బంది, హుకుంపేట వాసులు పాల్గొన్నారు.