లోక్ అదాలత్ ద్వారా 287 కేసులు పరిష్కారం..
Ens Balu
1
Srikakulam
2020-10-17 20:22:49
శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా 287 కేసులు పరిష్కరించివట్లు జిల్లా జడ్డి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగిందని, 17 బెంచ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. సివిల్ కేసులు 10, 9 మోటార్ యాక్సిడెంట్ కేసులు , సివిల్ సెటిల్ మెంట్ కేసులు, 128 కాంపౌండబుల్ క్రిమినల్ కేసు, 14 ఎన్.ఐ. యాక్టు చెక్ బౌన్స్ కేసులు, 53 సి.సి. అడ్మిషన్ కేసులు, 70 ఎక్సైజ్ కేసులు, కన్స్యూమర్ కేసు (01)ఒకటి, ఎస్.టి.సి. కేసులు (02) రెండు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ మరియు లీగల్ సర్వీసెస్ అధారిటీ నోడల్ అధికారి సుమీత్ కుమార్, డి.ఆర్.ఓ. బి.దయానిధి, తదితరులు పాల్గొన్నారు.