సీతమ్మధారలో 12ఎకరాల్లో ఆక్రమణలు..


Ens Balu
2
సీతమ్మధార
2020-10-17 20:55:33

విశాఖనగరంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్టు అర్బన్ తహసీల్దార్ జ్ఞానవేణి తెలిపారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు  పరిరక్షణలో భాగంగా నగరంలోని సీతమ్మధార మండల పరిధిలోగల ప్రభుత్వ భూములన్నింటినీ మండల సర్వేయర్,  రెవెన్యూ ఇన్స్పెక్టర్ 'గ్రామ రెవెన్యూ అధికారులు రెండు టీములుగా గత నెల రోజుల నుండి సర్వే చేసినట్లు   ఆక్రమణలు  సుమారుగా పన్నెండు ఎకరాల్లో (కొండ పోరంబోకు , చెరువులు , వాగులు, గయాలు ) వుండగా, రెగ్యులరైజేషన్ కాని ఆక్రమణలు 15%  ఉన్నాయని వారికి రెగ్యులరైజేషన్ దరఖాస్తులు చేసుకోమని తెలియజేయడమైనదని పేర్కొన్నారు. అభ్యంతరకర ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఆక్రమణ దారుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాధానాలు వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.