లక్ష్మీనారాయణ కుటుంబానికి APCPSEAతోడు..


Ens Balu
1
Chittoor
2020-10-18 18:19:14

ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా ఆర్దిక కార్యదర్శి నాపాలక్ష్మీనారాయణ మ్రుతిచెందంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా ఏకమై ఆ కుటుంబానికి రూ.15 ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఆ మొత్తాన్ని వివిధ రూపాల్లో దఫదఫాలుగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ దగ్గరుండి వీటిని ఆందించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరించి సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన నేత మా మధ్య లేకపోయినా, ఆ కుటుంబానికి తాము భరోసా కల్పించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆర్ధికంగా ఆదుకోవడానికి ప్రతీఒక్క ఉద్యోగి ముందుకి వచ్చారన్నారు. ఉద్యోగుల ఐకమత్యం, ఉదార స్వభావం వలనే నాపా లక్ష్మీనారాయణ కుటుంబానికి ఈ సహాయం చేయడానికి వీలుపడిందన్నారు. ఆ మొత్తంలో కిసాన్ వికాస్ పత్రం :- 2,65,000/-, సుకన్య సమృద్ధి యోజన:- 1,25,000/-,లక్ష్మి నారాయణ తల్లి గారికి ;- 1,00000/-, కుటుంబ పోణకు 2,04000/- APAEOs తరుపున రూ:- 8,00000/- లక్షలు అందించినట్టు చెప్పారు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గ్రాడ్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అందించడానికి కూడా అసోసియేషన్ ద్వారా క్రుషి చేస్తున్నట్టు రామాజంనేయులు వివరించారు. ఇదూ స్పూర్తితో సీపీఎస్ రద్దు కూడా సాధించి తీరుతామని స్పష్టం చేశారు..