విశాఖ పోర్ట్ సెక్రటరీ గా వేణుగోపాల్..
Ens Balu
3
విశాఖ పోర్టు ట్రస్టు
2020-10-19 13:39:50
విశాఖపట్నం పోర్ట్ సెక్రటరీ గా టి.వేణుగోపాల్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సెక్రటరీ గా సేవలు అందించిన సి.హరిచంద్రన్ తాజాగా కాండ్లా పోర్ట్ కి బదిలీ అయ్యారు. ఉద్యోగ బాధ్యత లు స్వీకరించిన వేణుగోపాల్ ను జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి .వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు, పోర్ట్ మాజీ సలహాదారు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అసోసియేషన్ ల నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం గత సెక్రటరీ హరిచంద్రన్ కు అందరు ఘనంగా వీడ్కోలు పలికారు. అందరి సహకారం తో పోర్ట్ అభివృద్ధి కి తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. భవిష్యత్తు లో పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పోర్ట్ మరింతగా పురోగతి సాదిస్తుందని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పోర్ట్ క్యాజువల్ కార్మికుల సంఘం ప్రతి నిధులు వర్మ, గోపి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.