బిసీలను అగ్రభాగన నిలబెట్టిన సీఎం వైఎస్ జగన్..
Ens Balu
3
Eluru
2020-10-19 15:52:19
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిసీల్లో అన్ని కేటగిరీలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు, వాటన్నింటికీ చైర్మన్లు నియమించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని మంత్రి తానేటి వనిత కొనియాడారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత డా.వై యెస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బిసి ల అభివృద్ధి కి బాటలు వేసింది సీఎం జగన్ ఒక్కే అన్నారు. గత ప్రభుత్వాలు బీసీ లకు ఇచ్చిన హామీలను మరిచారని ఈ సందర్భంగ మంత్రి గుర్తుచేశారు. బీసీ కులాలను వోట్ బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఆ వర్గాల వారికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదు మండిపడ్డారు. తరువాత కార్పొరేషన్ ఛైర్మన్ లు నలుగురు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కారుమురి నాగేశ్వరరావు, జి.శ్రీనివాస్ నాయుడు,ఉన్నమట్ల ఎలిజా ,వుప్పాల వాసుబాబు , కోటారు అబ్బాయి చౌదరి , తలారి వెంకటరావు గర్బ్,డి.సీసీబీ చైర్మన్ కౌరు శ్రీనివాస్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్య ,సూర్య బలిజ కార్పొరేషన్ కి శెట్టి ఆనంతలక్ష్మి ,అత్యంత వెనకబడిన కార్పొరేషన్ ఛైర్మన్ పేండ్ర వీరన్న, అతిరసుల కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.