30% ఆఫర్లతో ఆప్కో ఎగ్జిబిషన్..
Ens Balu
1
శ్రీకాకుళం
2020-10-22 19:10:30
దసరా, దీపావళి పండుగల సందర్భంగా అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు ఆప్కో ఎగ్జిబిషన్ మరియు విక్రయాలను చేపడుతున్నట్లు సంస్థ డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బి.ఉమాశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక ఆర్.టి.సి.కాంప్లెక్స్ దగ్గరలోని బి.ఆర్.అంబేద్కర్ సెంటర్ వద్ద గల చేనేత బజార్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను గురువారం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. పండుగల సీజన్ కావడంతో ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే రెండు ఉచితం బంపర్ ఆఫర్ గాను, ఒకటి కొంటే ఒకటి ఉచితం మెగా ఆఫర్ గాను, అన్ని రకాల వస్త్రాలపై 30% ప్రత్యేక తగ్గింపు ధరలతో వస్త్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పేరుగాంచిన ధర్మవరం, మాధవరం, వెంకటగిరి, మంగళగిరి, బందరు, గుంటూరు, రాజమండ్రి, ఉప్పాడ పట్టు, కాటన్ చీరలు, ధోవతులు, దుప్పట్లు, లుంగీలు, రుమాళ్లు, షర్టింగ్ క్లాత్, డ్రెస్ మెటీరియల్స్ తో పాటు అన్నిరకాల వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. 30 రోజులు పాటు నిర్వహించే ఈ ప్రదర్శనకు జిల్లా ప్రజలు హాజరై, చేనేత వస్త్రాలను విరివిగా కొనుగోలు చేసి, నేత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.