పేకాట స్థావరాలనుంచి.రూ.4.40లక్షలు స్వాధీనం
Ens Balu
5
Tirupati
2020-10-22 20:06:09
తిరుపతి ప్రాంతంలో జూదంపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా ఎస్పీ ఎ.రమేష్ రెడ్డి అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్బీ డిఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో జూదం నిర్వహిస్తున్న శ్రీకాలహస్తి తొట్టంబేడు కాసారం ప్రాంతాలపై మెరుపు దాడులు చేసి రూ.4.40లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. చాలా మంది ప్రత్యేకంగా ఇళ్లు తీసుకొని అక్కడ జూదం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతుందన్నారు. అలాంటివారిని వెంటాడి మరీ పట్టుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో మూడు కార్లు, 12 ద్విచక్ర వాహనాలు, 17 సెల్ ఫోన్లు స్వాధీనంతోపాటు 17 మంది జూదరులను అరెస్టు చేసినట్టు ఎస్పీ వివరించారు. ప్రత్యేక పోలీస్ దళాలు జిల్లా అంతటా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచామన్నారు. ఈ దాడుల్లో ఈస్ట్ సి.ఐ, తిరుచానూర్ సి.ఐ బ్రుందాలు పాల్గొన్నాయని వివరించారు.