డ్రైనేజీల్లో పూడికలు తొలగించండి..
Ens Balu
3
చిన ముషిడివాడ
2020-10-22 20:22:26
జివిఎంసీ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పూడికలను తొలగించి డ్రైనేజీలు మరమ్మత్తులు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా 6వ జోన్ 70వ వార్డు లోని చిన్నముషిడివాడ, సుజాతనగర్ తదితర ప్రాంతాలలోని స్థానిక ఎమ్మెల్యే ఎ. అదీప్ రాజ్ తో కలసి క్షేత్రస్థాయి పరిశీలించారు. చిన్నముషిడివాడ ఉడా కోలనీలోని కాలువలను పరిశీలించి పూడికలను తీయించాలని, పాడైన డ్రైన్ లను మరమ్మత్తులు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. కాలువల వెంబడి పందులు సంచరించడం గమనించిన కమిషనర్ వాటిని నిర్మూలించాలని చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ ని ఆదేశించారు. ఉడా కోలనీలో ప్రభుత్వ భూమిలో బిల్డింగు మెటీరియలైన ఇసుక, పిక్క తదితర వ్యాపారాలు చేస్తుండడం గమనించి వెంటనే వాటిని తొలగించాలన్నారు. అక్కడక్కడ అనధికారంగా వెలసిన రేకుల షెడ్లను తొలగించాలని, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సుజాత నగర్ లోని నాగమల్లి లే అవుట్, బాలాజీ రేసిడేన్షియల్ అపార్ట్ మెంట్ తదితర ప్రాంతాలలో వర్షాలవలన పలురోడ్లపైకి మట్టి బురద చేరి రహదారి ఇబ్బంది అవుతున్నందున రోడ్డుపై ఉన్న బురదను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో పెందుర్తి శాసన సభ్యులు ఎ. అదీప్ రాజ్, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాద రాజ్, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, జోనల్ కమిషనర్ బి. వి. రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ భాస్కర్ బాబు, ఏ.ఎం.ఓ.హెచ్. లక్ష్మీ తులసి, కార్య నిర్వాహక ఇంజినీరు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.