కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..


Ens Balu
2
Madhavadhara
2020-10-22 20:56:22

అన్ని రకాల వాహనాల్లో కొవిడ్ నిబందనలు తప్పనిసరిగా పాటించాలని ఉప రవాణా కమీషనర్  జిసిరాజరత్నం స్పష్టం చేశారు. విశాఖలోని మాదవధర ఆర్ టి ఎ కార్యాలయంలో ప్రైవేటు బస్సు, లారి, టాక్సీ, ఆటో అసోసియేషన్ ప్రతినిదులతో కోవిడ్ నివారణ చర్యలపై సమావేసం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసి మాట్లాడుతూ, ప్రభుత్వం జారీచేసిన  జి.ఒ.520, కోవిడ్ ఉత్తర్వులు-83 అనుసరించి రవాణా వాహనాల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు తపనిసరిగా  తమ డ్రైవర్ర్లుకు, సిబ్బందికి కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. మాస్కు లేకుండా ఎటువంటి పరిస్తితులలో వాహనాలలోకి అనుమతించరాదని, లారి, టాక్సీ, బస్సు లలో కోవిండ్ నివారణ పై అవగాహన పోస్టర్స్ ప్రదర్శించాలన్నారు. వాహనాలల్లో సామజిక దూరం పాటించాలని ప్రయాణికులను కోరారు.  ప్రయాణికులు  చేతులను సానిటైజర్ తో శుభ్రపరుచుకోవాలన్నారు.  వాహన దారులు  తమ వాహనాలను సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం తో సానిటైజ చేసుకున్నతరువాతే బయటకు తీసుకురావాలన్నారు.  సరుకు రవాణా వాహనాలో ప్రయాణీకులను ఎక్కించరాదని, ప్రయాణీకుల వాహనాలలో 50% మాత్రమే ఎక్కించాలన్నారు.  కోవిడ్ లక్షణాలు కలిగిన ప్రయాణీకులు, సిబ్బంది లను ఎక్కించరాదని కోరారు. ప్రైవేటు బస్సు లలో 6 అడుగులు సామజిక దూరం, Q  విధానం తప్పనిసరిగా  పాటించాలన్నారు. ప్రయాణీకులకు ధర్మల్  స్క్రీనింగ్ నిర్వహించాలని, మాస్కు, సానిటైజర్ లు లేకుండా బస్సులలో అనుమతించరాదన్నారు.  అలాగే RTC  బస్సు లలో పై నిబందనలు పాటించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు, ఆర్ సి హెచ్ శ్రీనివాస్, కె వి ప్రకాష్, rtc  డిపో మేనేజర్ ఆర్ఎస్. తదితరులు పాల్గొన్నారు.