27న జివిఎంసీ షాపుల వేలం పాట..
Ens Balu
5
Visakhapatnam
2020-10-23 15:14:14
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ జోన్ – 2 పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణములు, మార్కెట్లు నకు సంబందించి వేలంపాటు నిర్వహించనున్నట్లు రెండవ జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. జోన్ – 2 కార్యాలయంలో తేది.27-10-2020న ఉదయం 11.00గంటలకు వేలంపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లకు సంబందించి నెహ్రూ బజార్ రోడ్డు ప్రక్కన ఆశీలు వసూలు చేయుటకు(63 దుకాణములు మినహాయించి), శ్రీ నగర్ మార్కెట్, జగ్గారావు బ్రిడ్జ్ మార్కెట్, వాల్తేరు వారాంతపు సంతలకు మరియు దుకాణములకు సంబందించి పాండురంగాపురం షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్లు 1, 3, 4, 6, 12 & 15, షాప్ నెంబర్లు 2, 7(ఎస్.సి. కోటా), షాప్ నెంబర్లు 8(ఎస్.టి.కోటా), డైమండ్ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబరు. 2, శివాజీ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్లు 1, 2, 3 & 4, ఆశీల్ మెట్ట షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబరు 7 లను వేలంపాటు నిర్వహించబడునని తెలిపారు. కావున, ఆసక్తి గల వ్యక్తులు/ సంస్థలు సదరు బహిరంగ వేలం నందు పాల్గొనవలసినదిగా కోరడమైనది. పూర్తీ వివరములకు జోన్-2 కార్యాలయ పర్యవేక్షకుల వారిని పనివేళలలో సంప్రదించగలరని జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస రావు తెలిపారు.