స్వయం ఉపాదిపై యువత ద్రుష్టిసారించాలి..


Ens Balu
2
Tadepalligudem
2020-10-24 13:06:02

డిగ్రీలు చదివిన యువత ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహ పడకుండా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపుతో స్వయం ఉపాది వైపు అడుగులు వేయడం అభినంద నీయమని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో పూర్తి స్థాయి సానిటైజేషన్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన ఐక్రీమ్ పార్లర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగనన్న ఇచ్చిన పిలుపు మేర స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ ఐ- క్రీమ్ అనే ఐస్ క్రీమ్ ,నార్త్ ఇండియన్ వంటకాల దుకాణంతో యువత నిరుద్యోగులకు మార్గదర్శిగా నిలవాలన్నారు. కరోనాలాంటి సమయంలో నిరుద్యోగులకు ఏదో ఒక రూపంలో ఉపాది కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా అనేక ఉపాది శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కొందరు స్వచ్ఛందంగా ఈ స్థాయి దుఖాణాలు ప్రారంభించి వారి టేలంట్ ను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, కొట్టు విశాల్ హాజరై సానిటైజేషన్ టన్నెల్ ను ప్రారంభించారు. నిర్వహుకులు డి.ఆశిష్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.