చైర్మన్లంతా ప్రభుత్వానికి పేరుతేవాలి..
Ens Balu
2
Seethammadara
2020-10-24 19:51:22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఇటీవల నియమించ బడిన వివిధ కార్పొరేషన్ లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఆయనను కలిసిన వారిలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్, నాగవంశీ కార్పొరేషన్ చైర్ పర్సన్ కొండమ్మ, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మ, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ టి. రాము, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబీరా బేగం, సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ బషీరున్నీసా బేగం, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్, మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ విజయచందర్ ఉన్నారు.