మద్యం వద్దు-కుటుంబం ముద్దు అంటున్న ఎంపీలు


Ens Balu
2
2020-07-20 21:24:30

ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచారం  కరపత్రాలను సోమవారం అరకు ఎంపీ గొడ్డేటి.మాధవి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లు ఆవిష్కరించారు. అనంతరం వీరు మాట్లాడుతూ  ఏపీ ప్రభుత్వం  మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంపూర్ణ  మద్యపానం నిషేధం దిశగా  ముందుకెళుతుందన్నారు. ఇప్పటికే దశలవారీగా మద్యం షాపులు  సంఖ్య తగ్గించడంతో పాటు, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి  మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచడం శుభపరిణామం అన్నారు.  మద్యం వద్దు - కుటుంబం ముద్దు  అనే నినాదంతో ఏర్పాటుచేసిన ప్రచార  కరపత్రాలను  ఆవిష్కరించిన అనంతరం ఏపీఏఏసీ స్టేట్ ఇంఛార్జి సురేష్ బేత మాట్లాడి ప్రజల్లోకి మద్యపాన నిశేదం అంశాన్ని పూర్తిస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు సుఖంగా ఉండాలంటే మద్యానికి దూరంగా ఉండాలనే విషయం ప్రజలు తెలుసుకునేలా ప్రచారాన్ని అన్ని గ్రామాలకు విస్తరించాలని ఈ సందర్భంగా ఎంపీలు సూచించారు.