ఉల్లి పంట నష్టాలపై నివేదికలు తయారుచేయండి..
Ens Balu
3
తాండ్రపాడు
2020-10-25 13:59:47
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంటకు నష్ట ఏర్పడింతో నివేదికలు తయారు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని బి.తాండ్రపాడు మండలంలోని ఉల్లిపంటల ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఉల్లి పంటలు వేసిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పెట్టుబడులు, చేసిన కూలీ మొత్తం నష్టం భారీగా వచ్చిందని రైతులు కలెక్టర్ కి తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు జరిగిన పంటనష్టాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని, ఖచ్చితంగా నష్టపరిహారం అందుతుందని చెప్పారు. జిల్లాలో మండలాలు, ప్రాంతాల వారీగా నష్టాలను అంచనాలు వేసి పంపాలన్నారు. పంట నష్టపోయిన ఏఒక్క రైతును వదిలిపెట్టకుండా నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. కర్నూలులో ఉల్లి పంట పూర్తిగా పాడైపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి సరఫరా నిలిచిపోయి ప్రస్తుతం కేజి ఉల్లి రూ.100 పలుకుతుండగా, బయట మార్కెట్ లో రూ.120 వరకూ అమ్ముతున్నారని కూడా రైతులు కలెక్టర్ కివివరించారు.