గీతం భూ ఆక్రమాలపై CBIకి ఫిర్యాదు..


Ens Balu
2
సిబిఐ కార్యాలయం వైజాగ్
2020-10-26 15:56:31

విశాఖలో  గీతం టుబీ డీమ్డ్  యూనివర్సిటీ  భూ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేయాలంటూ,  AP ప్రజా సంఘాల జెఎసి అధ్యకులు జెటి రామారావు సిబిఐకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని సీబీఐ ఎస్సీకి ఈ మేరకు జెటి ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా సీబీఐ కార్యాలయం దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు.. సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి విశాఖపట్నంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీ పై పూర్తిస్థాయిలో సి.బి.ఐ ,ఈ డి వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి, ఆక్రమిత భూమిని తక్షణమే స్వాధీనం చేసుకొని నిరుపేదల పంచాలన్నారు. సంస్థకు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల అదాయం  ఫీజులు , విరాళాల రూపంలో అర్దిక నేరాలకు పాల్పడ్డారని, మనీలాండరింగ్ ఇన్కమ్ టాక్స్ చట్టాల ద్వారా తనిఖీలు నిర్వహించాలని లేకుంటే రికార్డులు తారుమారు అవుతాయని అనుమానం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గీతం టుబీ డీమ్డ్ యూనివర్సిటీ ని స్వాధీనం చేసుకోకపోతే, అక్కడి ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేసి క్రబద్దీకరణ కూడా అడ్డదారిలో చేయించుకుంటారన్నారు. పేదల భూములను ప్రై వేటు విద్యాసంస్థల ముసుగులో ఆక్రమించడం చట్టరీత్యానేరమని, దానిపై సిబిఐ లోతుగా విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు, అక్రమాలు బయటకొస్తాయన్నారు.  అలాగే వర్సిటీ లోపల ఉన్న అధునాతన భవనాలు క్రికెట్ గ్రౌండ్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించారని వాటిని వెంటనే కూల్చి వేయాలని డిమాండ్ చేశారు..ఒక్కరాత్రిలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు కూడా ఎలా వచ్చాయనే విషయంపైనా ఆరా తీయాలని డిమాండ్ చేశారు. ఆక్రమిత ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఇలాంటి భూ ఆక్రమణలను నియంత్రించకపోతే ప్రభుత్వానికి చెందిన భూములన్నీ ఆక్రమించేస్తార ఆందోళన వ్యక్తం చేశారు. గీతం టూబి డీమ్డ్ వర్శిటీపై  యూజికి కూడా ఫిర్యాదు చేసినట్టు జెటి రామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.