రైతులు భూములివ్వడం అభినందనీయం..


Ens Balu
3
శ్రీకాకుళం కలెక్టరేట్
2020-10-26 17:13:12

వంశధార హై లెవెల్ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం ఆనందదాయకమని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఛాంబరులో బూర్జ మండలానికి సంబంధించిన అహోబలచార్యుల పేట, ఉప్పినివలస గ్రామాల రైతులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలో వంశధార హై లెవెల్ కెనాల్ నిర్మాణానికి 18 గ్రామాలకు చెందిన భూమిని సేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. రైతుల భూమికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక ధరను నిర్ణయించిందని, ఇందుకు రైతులు స్వచ్చంధంగా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. వంశధార హై లెవెల్ కెనాల్ భూసేకరణలో రైతులకు ఎటువంటి నష్టం ఉండదని, రైతులకు ప్రభుత్వం సంతృప్తికర ధర ఇచ్చే అవకాశముందని  ఆయన చెప్పారు. మరికొన్ని గ్రామాల రైతులతో చర్చలు జరపాల్సి ఉందని, అన్ని గ్రామాల రైతులతో మాట్లాడి భూసేకరణ చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ఈ సమావేశంలో యూనిట్ – భూ సేకరణ విభాగం 3 ప్రత్యేక ఉపకలెక్టర్ బి.కాశీవిశ్వనాథం, ఉప తహశీల్ధారులు యన్.హనుమంతరావు, టి.వెంకటేశ్వర పాణిగ్రహి, మంత్రి రవికుమార్, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.