వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం


Ens Balu
3
VJF Press Club
2020-10-28 16:38:14

జాతీయ జర్నలిస్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎడిటర్స్‌ అండ్‌ రిపోర్టర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా జర్నలిస్టులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా వ్యాచరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాకుమాను వెంకట వేణు తెలిపారు. బుధవారం వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఏపీలోని వివిధ రీజియన్ల నుంచి ఈ పోటీలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు.నేటి రాజకీయ పార్టీలు, పత్రికల పాత్ర అనే అంశంపై పోటీల్లో పాల్గొనే వారు తమ ఎంట్రీలను పంపాల్సి ఉంటుందన్నారు.పచ్చదనం` పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పోటీల్లో పాల్గొనే వారు  చదువుతున్న విద్యా సంస్థ గుర్తింపు కార్డుతో పాటు వ్యాస రచన, చిత్రలేఖనం ఎంట్రీలను ఏపీ ఎడిటర్స్‌ అండ్‌ రిపోర్టర్స్‌ యూనియన్‌ విశాఖపట్నం రీజియన్‌ కార్యాయానికి పంపాల్సి ఉంటుందని వివరించారు.