విధినిర్వహణలో అలక్ష్యం వహిస్తే చర్యలు..
Ens Balu
5
ఉయ్యూరు
2020-10-28 19:38:30
ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడంలో గ్రామసచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యహరించాలని క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఏ. ఎం. డీ. ఇంతియాజ్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ఉయ్యురు మున్సిపల్ పరిధిలో తోట్లవల్లూరు కెనాల్ బ్రిడ్జిలో ఉన్న వార్డు సచివాలయం 4 & 6 కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సచివాలయాల్లో రికార్డులను తనిఖీ చేవారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన సేవలు ప్రజలకు వాలంటీర్ల ద్వారా తెలిసేలా చైతన్యం కలిగించాలన్నారు. అంతేకాకుండా సచివాలయాల్లో అందే సేవల వివరాలను బోర్డుల ద్వారా ప్రజలకు అర్ధమయ్యేలా తగిలించాలన్నారు. కరోనా సమయంలో సిబ్బంది కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించడంతోపాటు, ప్రజలను కూడా చైతన్యం చేయాలన్నారు. విధి నిర్వహణలో ఎవరు అలక్ష్యంగా వ్యవహరించా కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అన్నిశాఖల సిబ్బంది మూమెంట్ రిజస్టర్, బయోమెట్రిక్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు...