తూ.గో.జిలో ఘోర రోడ్డు ప్రమాదం 6గురు మృతి..


Ens Balu
3
తంటికొండ
2020-10-30 10:36:24

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం దిగువ భాగంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహం అనంతరం అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో పెళ్లి బృందంలో 20 మంది డీసీఎం వ్యాన్ లో తిరుగుప్రయా ణమయ్యారు. కొండ పై నుండి కిందికి దిగుతున్న సమయంలో వ్యాన్ అదుపుతప్పి మెట్లమీదుగా వెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. కాకినాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మిగిలిన వాళ్లు రాజమండ్రిలోని మూడు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో వధూవరులు వేరే వాహనంలో ఉండటంతో వారు బతికి బట్టగట్టారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.