అన్నార్తుల సేవలో కాకిరవిబాబు కుటుంబం
Ens Balu
3
రాజమహేంద్రవరం
2020-10-30 15:21:59
కరోనా వైరస్ తో అన్నార్తులకు ఆకలి తీర్చడంలో ఎంతో ఆనందం సొంతం చేసుకున్నామని ప్రముఖ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కాంట్రాక్టర్ కె.రవిబాబు అన్నారు. శుక్రవారం తన జన్మదినం సందర్భంగా రాజమండ్రి ఫుడ్ అండ్ బ్లడ్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, కరోనా విపత్తు అన్ని వర్గాలకు నష్టాన్ని తెచ్చిందని, ఈ సమయంలో అనాధ ఆశ్రమాలు, నా అనుకునేవారు లేనివారికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. అలాంటివారందరికీ దాతలు చేస్తున్న మంచిపనులు తనను కూడా కదిలించాయని అన్నారు. ప్రతీనెలా బాబావారి ఆశీస్సులతో బియ్యం దానం చేసే తాము, ఈ సారి నేరుగా భోజనం తయారుచేసి కుటుంబ సమేతంగా అన్నదానం చేసినట్టు వివరించారు. ఒక మంచి కార్యక్రమం చేయడం ద్వారా అది ఎందరికో ఆదర్శం అవుతుందన్నారు. చాలా మంది దాతలను చూసి తనకున్నదానిలో కొంత భాగం సేవకు వెచ్చిస్తున్నట్టు రవి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకిరవిబాబు కుటుంబ సభ్యులు జ్యోతి,ప్రియాంక, గుణసాయితేజ, సొసైటీ సిబ్బంది, రవి మిత్రులు పాల్గొన్నారు.