పోస్కో చర్చలు బహిర్గతం చేయాలి..


Ens Balu
3
గాంధీవిగ్రహం సెంటర్
2020-10-30 18:59:01

అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌`పోస్కో జాయింట్‌ వెంచర్‌పై చర్చించారు. పోస్కో యాజమాన్యంతో జరిపిన చర్యను సిపిఐ(ఎం) పార్టీ గ్రేటర్‌ విశాఖ నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని కార్యదర్శి డా॥ బి.గంగారావు చెప్పారు. శుక్రవారం ఈ విషయమై జీవిఎంసీ ఎదురుగా వున్న గాంధీ విగ్రహ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తక్షణమే పోస్కో యాజమాన్యంతో జరిగిన చర్చ వివరాలు బహిర్గతం చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రిని సిపిఐ(ఎం) పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.   పోస్కోకి వ్యతిరేకంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లోని కార్మికులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల తో పాటు వివిధ రాజకీయ పార్టీలు  తీవ్ర పోరాటం చేస్తున్నామని.. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పోస్కో యాజమాన్యంతో చర్చించటం దుర్మార్గమన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను జాయింట్‌ వెంచర్‌ పేర పోస్కోకి కట్టబెట్టే చర్యలు  ముఖ్యమంత్రి విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పోస్కోకి కట్టబెట్టుటమంటే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పనిసరిగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు అండగా ఉండాలన్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) నాయకు ఆర్‌కెఎస్వీ కుమార్‌, బి.జగన్‌, ఎం.సుబ్బారావు, ఎం.కృష్ణారావు తదితయి పాల్గొన్నారు.