కరచాలనం వద్దు..నమస్కారం ముద్దు..
Ens Balu
3
Vizianagaram
2020-10-30 20:45:56
"కరచాలనం వద్దు.. నమస్కారమే ముద్దు" అ ని వైద్య సిబ్బంది నినదించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా పై అవగాహన కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుంచి మహారాజ ఆసుపత్రి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తరువాత అధికంగా జనసంచారం పెరిగిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీనీ సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం ర్యాలీ స్థానిక మహారాజ ఆసుపత్రికి వరకు సాగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణా కుమారి, ఎం.ఆర్.హాస్పిటల్ సూపరింటెండెంట్ సీతారామరాజు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.