పోర్ట్ క్యాజువల్ కార్మికులకు న్యాయం చేయండి..ఎంపి


Ens Balu
3
Visakhapatnam
2020-07-24 14:44:01

విశాఖపోర్ట్ ట్రస్ట్ లో గత12ఏళ్లుగా సేవలందిస్తున్న క్యాజువల్ కార్మికులను ఆదుకొని, సత్వరమే  న్యాయంచేయాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు.శుక్రవారం 347 బ్యాచ్  కాజువల్ కార్మికులకి సంబందించిన పెండింగ్  అంశాలను  పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు, డిప్యూటీ చైర్మన్ హరనాధ్ ల దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. కారుణ్య నియామకాల కింద 12 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన 347 క్యాజువల్ కార్మికులకు నేటికీ సరైన పనిలేకుండా నానా అవస్థలు పడుతున్నారని ఎంపీ తెలియజేశారు. కేంద్రమంత్రి మాoడవీయతోనూ మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ చైర్మన్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,,   కార్మిక సంఘం ప్రతినిధులు శ్రీనివాస్ వర్మ, గోపి, కృష్ణ , ప్రసాద్ పాల్గొన్నారు..                        
సిఫార్సు