ధర్మశ్రీ కూతురు పెళ్లికి హాజరైన సీఎం వైఎస్ జగన్..


Ens Balu
3
Visakhapatnam
2020-10-30 21:04:58

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం స్థానిక హోటల్ లో ఏర్పాటు చేసిన వివాహానికి హాజరై వధూవరులను ఆయన ఆశీర్వాదించారు. (వధూవరులు డాక్టర్ సుమ, డాక్టర్ చిన్నంనాయుడు) ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాసు, పుష్పశ్రీవాణి, రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్లమెంటు సభ్యులు జి. మాధవి, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, భాగ్యలక్ష్మి, వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ కు విశాఖ ఎయిర్ పోర్టులో ఘనంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఘనంగా వీడ్కోలు పలికారు.