ఎయిర్ పోర్టు సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
3
Orvakal
2020-11-01 11:33:49
ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ లాంజ్ లో పెండింగ్ పనులను సత్వరమే పూర్తిచేయాలని పై ఎయిర్పోర్ట్ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. ఆదివారం ఎయిర్ పోర్టులోని ప్యాసింజర్ లాంజ్ జరుగుతున్న పనులను ఆయన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియాన్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎయిరపోర్టులు పూర్తయిన ప్రాంతాల నుంచి ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులను అభివ్రుద్ధి చేయడంతోపాటు, కొత్త ఎయిర్ పోర్టులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధాన్లుల్లో జ్యూడిషియల్ కేపిట్ కాబోతున్న ఈ జిల్లాలో ఎయిర్ పోర్టును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎయిర్ పోర్టు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్ డి ఓ వెంకటేష్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ ఈ సుబ్రమణ్యం, వివిధ శాఖల ఇంజనీరింగ్ ఎస్ ఈ లు, జిల్లా అధికారులు, ఎయిర్ పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.