పొట్టి శ్రీరాములు పోరాట పటిమ అందరికీ ఆదర్శం..
Ens Balu
3
కలెక్టరేట్
2020-11-01 11:56:41
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆయనకిచ్చే ఘనమైన నివాలళి అన్నారు. అంతకు ముందు చిల్డ్రెన్స్ పార్క్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర బుగ్గన రాజేంద్రనాథ్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, డా. జె. సుధాకర్, నగర పాలక సంస్థ కమీషనర్ డి.కె. బాలాజీ, జేసీలు రామ సుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజామోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయతను తెలిపే కార్యక్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి...