వరలక్ష్మి దారుణ హత్యవెనుక కారణాలివే..
Ens Balu
3
గాజువాక
2020-11-01 13:44:52
విశాఖజిల్లా గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి.. పోలీసులు తెలిపిన వివరాలు.. వరలక్ష్మి హత్య పథకం ప్రకారమే జరిగిందని.. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని స్పష్టమైంది..వరలక్ష్మిపైన అనుమానం రావడంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో రూఢీ అయింది.. వివరాలు తెలుసుకుంటే సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం వరలక్ష్మి ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశ్యంతోనే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ఊహించని ఈ పరిణామాలతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి అండగానిలుస్తున్నారు. వరలక్ష్మిని కిరాతకంగా హతమార్చిన సంఘటనతో విద్యార్ధినిలు అప్రమత్తంగా ఉండాలని అటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచియాలు మంచిది కాదని సూచిస్తున్నారు. ఏదైనా తేడా ఉన్నట్టు అనిపిస్తే తక్షణా దిశ యాప్ ద్వారా పోలీసులకు సందేశం పంపాలని కూడా కోరుతున్నారు. కాగా విశాఖజిల్లాలో ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.