శ్రీవారికి ఐదు బ్యాటరీ ఆటోలు విరాళం..
Ens Balu
3
Tirumala
2020-11-01 16:03:11
తిరుమల శ్రీవారికి ఆదివారం ఐదు బ్యాటరీ ఆటోలు విరాళంగా అందాయి. ఆదివారం వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్, ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ లు కలిసి ఈ మేరకు దాదాపు రూ.15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను టిటిడి అధికారులకు అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ ఎం.డి. జి.ఏ. హరికృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇంచార్జ్ డెప్యూటీ ఈవో వెంకటయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రవాణా విభాగం డి.ఐ. మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మూడు ఆటోలను కోవిడ్ -19 శానిటేషన్ కోసము, రెండు ఆటోలు తిరుమలలో వ్యర్ధాలను తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. తిరుతమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎలాంటి కరోనా వైరస్ దరచేరకుండా ఈ ఆటోల ద్వారా పిచికారి చేయనున్నారు.