శ్రీ పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం మరువలేనిది..
Ens Balu
3
Kakinada
2020-11-01 16:34:44
ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెఎన్టియుకె ప్రాంగణంలో ఆదివారం డిజిటల్ మోనిటరింగ్ సెల్ (డిఎంసి) లో ఘనంగా నిర్వహఇంచారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎం.రామలింగరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, తెలుగు వారి కోసం రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓఎస్డి ఆచార్య వి.రవీంద్రనాధ్, డిఏపి ప్రొ.ఆర్.శ్రీనివాసరావు, డిఏఏ ప్రొ.వి.రవీంద్ర, డైరెక్టర్ అడ్మిషన్స్ ప్రొ.కెవి.రమణ, ఎఫ్డిసి డైరెక్టర్ ప్రొ.వి.శ్రీనివాసులు, ఐఐఐపిటి డైరెక్టర్ ప్రొ.ఎన్.మోహన్రావు, ఐక్యూఏసి సెల్ డైరెక్టర్ ప్రొ.ఎన్.బాలాజీ, డా.బి.ఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ లైబ్రేరియన్ డా.బి.ఆర్.దొరస్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.