ఘనంగా శంకర్రావు ఉద్యోగ విరమణ సభ..
Ens Balu
6
అడవివరం
2020-11-01 17:11:35
మంచికి మారుపేరుగా నిలిచి ది అడవివరం కోఆపరేటివ్ సొసైటీ ప్రహ్లాదపురం బ్రాంచ్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ పొందిన నక్కాన శంకర్రావు శేష జీవితం ఆనందంగా గడపాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. ఆదివారం అడవివరంలో సొసైటీ చైర్మన్ కర్రి అప్పల స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శంకర్రావు ఉద్యోగవిరమణ కార్యక్రమంలో గంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొసైటీలో అంచలంచెలుగా ఎదిగి బ్యాంక్ మేనేజరుగా రిటైర్అయ్యారన్నారు. సొసైటీ ద్వారా ఎన్నోసేవలు అందించిన ఘనగ శంకర్రావుకి దక్కుతుందని అన్నారు. ఈయనలేని లోటు సొసైటీలో పూరించలేదని అన్నారు. అనంతరం శంకర్రావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అజయ్,టిడిపి వార్డు అధ్యక్షడు బి.నరసింహం, వైఎస్సార్సీపీ 98వార్డు నాయకులు కె.ఈశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.