వైఎస్సార్ జల కళతో రైతులంతా శుభిక్షం..
Ens Balu
5
Atmakur
2020-11-01 20:19:19
సన్న చిన్నకారు రైతులకు వచ్చే నాలుగేళ్లలో 2లక్షల బోర్లు తవ్వించటమే ఈ వైఎస్ఆర్ జలకళ ముఖ్య ఉద్దేశ్యమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వై.యస్.ఆర్. జలకళ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైఎస్సార్ జలకళ కోసం 2,340 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉచిత బోరు బావులను తవ్వడం ద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులకు మేలు చేకూరుస్తామన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో లేదా బోర్లు వైఫల్యం చెందిన సమయంలో తిరిగి బోరు వేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు వై.యస్.ఆర్. జలకళ ఒక వరంగా పనిచేస్తుందన్నారు. వైయస్సార్ జలకళ ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ బోర్లు వేయడంతో పాటు, చిన్న, సన్నకారు రైతులకు మోటార్లు కూడా అందిస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో రైతుల ఆశలన్నీ ఫలిస్తున్నాయన్న మంత్రి.. రైతు భాందవుడు స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి కృషి ఫలితమే మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ప్రాంతానికి సమృద్ధిగా సాగునీరు అందించగలుగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు...