ఇక నుంచి మంత్రి డా..తానేటి వనిత..
Ens Balu
3
Kovvur
2020-11-02 19:00:55
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సాధారణ వనిత వ్యక్తి కాదు..డా.తానేటి వనిత..అవును ఈమె సేవలను గుర్తిస్తూ, డేస్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ఈరోజు ప్రధానం చేసింది. మంత్రితోపాటు ఎమ్మెల్సీ రామసూర్యారావుకి సామాజిక సేవలను గుర్తిస్తూ కూడా ఆయనకు కూడా గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లో జరిగిన కార్యక్రమంలో న్యూ జెరుసలం ఇంటర్నేషనల్ బైబిల్ ధియోలజికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శిరంపురం యూనివర్సిటీ నుండి వచ్చిన సెక్రెటరీ రెవరన్ డా. తాతపూడి మ్యాత్యుస్ ఇమ్మన్యుల్ ఈ గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మ్యాత్యూస్ మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా ప్రజలకు విశేషంగా సేవలు అందించిన వారిని గౌరవ డాక్టరేట్లతో గౌరవిస్తామని, ఈ ఏడాది వీరిని డాక్టరేట్లకు ఎంపిక చేసినట్టు చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాతూ, డేస్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ తనను గుర్తించడం ఆనందంగా వుందన్నారు. ఈ డాక్టరేట్ తనపై మరింత బాధ్యతను పెట్టిందన్నారు మంత్రి.. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు..