కరోనా తగ్గితే ఎపుడైనా మేం రడీ..


Ens Balu
3
ఏపీఎన్జీఓ హోం
2020-11-03 21:04:21

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందిని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లడుతూ, దేశంలో ఇటు వంటి వ్యవస్థ ఎక్కడ లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సచివాలయ వ్యవస్థను అభినందించారని ఆయన గుర్తుచేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సమంలో సచివాలయ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూనే, కరోనాభారిన పడుతున్నారని అన్నారు. త్వరలోనే ఉద్యోగులు అందరూ అమరావతి నుంచి వైజాగ్ వస్తున్నారని, వారంతా వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారన్నారు. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన జీతాలను ఈ నెల నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నఆయన  మూడు డీఏలు ఇవ్వడంపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పేరు చెప్తేనే అందరూ భయపడే పరిస్థితి ఉన్న సందర్భంలో ఎన్నికలు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని.. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా తగ్గిన సమయంలో ఎప్పుడు ఎన్నికలు పెడతామన్నా మా ఉద్యోగులం అంతా సంసిద్దంగా వుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖజిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, జవహర్ తదితరులు పాల్గొన్నారు..