ఆరోగ్యశ్రీ ఉన్నా.. డబ్బులు వసూలు చేస్తారా..
Ens Balu
2
ప్రజ్ఞ క్యాన్సర్ ఆసుపత్రి
2020-11-04 18:56:23
అనంతపురం నగర శివారు ప్రాంతంలోని ప్రజ్ఞ క్యాన్సర్ ఆసుపత్రిలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో 20 మంది రోగుల నుండి డబ్బు వసూలు చేసినట్లు అక్కడ ఉన్న రోగులు చెప్పడంతో హాస్పిటల్ యాజమాన్యం నుండి రూ..42000 లను రోగులకు తిరిగి ఇప్పించారు.. రోగులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నా.. రోగుల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఫీజులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపై గతంలో జిల్లాలోని నెట్వర్క్ ఆసుపత్రుల అధిపతులతో సమావేశం నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్య మిత్రలు వైద్యం కోసం వచ్చే వారికి అండగా ఉండాలని కోరారు. ఆసుపత్రుల యాజమాన్యాలు పేదలపై అన్యాయంగా బిల్లుల భారం మోపకుండా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బు కట్టాల్సిన అవసరం లేదని రోగులకు అవగాహన కల్పించాలన్నారు. తనిఖీలో జాయింట్ కలెక్టర్ తో పాటూ డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శివకుమార్ పాల్గొన్నారు.