అనకాపల్లిని అందంగా తీర్చిదిద్దుతాం..
Ens Balu
1
Anakapalle
2020-11-04 19:00:46
అనకాపల్లి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుదామని ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని జివిఎంసి కమిషనర్ డా జి. సృజన అన్నారు. బుదవారం ఆమె క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా అనకాపల్లి జోన్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. సంతబయిల్ లో నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1000కిలోలీటర్ల మంచి నీటి రిజర్వాయర్ ప్రతిపాదనలను సిద్ధంచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం, అనకాపల్లి నూకాలమ్మ తల్లిని దర్శించుకొని నూకాంబిక ఆర్చ్ నుంచి పూడిమడక రోడ్ల విస్తరణ, డ్రైన్ల నిర్మాణం, ఫుట్ పాత్ లకు సంబందించిన ప్రతిపాదనలను పంపాలన్నారు. రాజీవ్ గాంధి ఇండోర్ స్టేడియం రిపేరు పనులునకు ప్రతిపాదనలను పరిశీలించి, ఫ్లోరింగ్ మొదలైన పనులకు లైఫ్ పీరియడ్ ఉన్నందున సంబందిత కాంట్రాక్టరు చేత పనులు చేయించాలని అంతవరకు వారి ఇ.ఎం.డి.లను ఆపాలన్నారు. పరశురాం పేటలోని శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, గ్యాస్ ఆధారిత దహన వాటికను ఏర్పాటు చేయాలని వాటికీ అవసరమైన ఎలెక్ట్రికల్ రింగ్ పోల్స్ ఏర్పాటుకు పరిశీలించాలని కోరారు. అనకాపల్లి రోడ్లు చాలావరకు రోడ్లు మరియు భవనముల శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నందున, వాటి నిర్వహణ నిమిత్తం జివిఎంసికి ఇవ్వాలని లేఖ వ్రాసామని, అవి వచ్చిన వెంటనే పనులు ప్రారంబిస్తామన్నారు. పెరుగు బజారు సచివాలయాన్ని సందర్శించి వార్డు కార్యదర్శుల జూబ్ చార్టును పరిశీలించి, వారి విధుల గురుంచి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యదర్శుల హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీ మొదలైనవి పరిశీలించారు. అనంతరం, శంకరంలోని ఎఫ్.ఎస్.టి.పి. ప్లాంటును పరిశీలించి, చుట్టూ ప్రహరీ గోడ వెంటనే నిర్మించాలని, ప్లాంటును వినియోగంలోనికి తేవాలని పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్ ను ఆదేశించారు. అనంతరం, అనకాపల్లి లోని నూతన జోనల్ కార్యాలయాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలను సిద్దం చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి, పర్యవేక్షక ఇంజినీర్లు రాజా రావు, వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజినీరులు మత్స్యరాజు, వెంకటరావు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.