ఏయూ ఆచార్యునిగా క్రిష్ణమోహన్‌..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-04 19:53:25

ఆంధ్రవిశ్వవిద్యాలయం కామర్స్‌మేనేజ్‌మెంట్‌ ‌విభాగ ఆచార్యునిగా ఆచార్య వి.క్రిష్ణమోహన్‌  ‌బుధవారం బాధ్యతలు  చేపట్టారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో, ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి రవీంధ్రనాథ్‌ ‌బాబు నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. అనంతరం విభాగంలో ఆచార్యునిగా బాధ్యతలు స్వీకరించారు. తనను ఆచార్యునిగా పునర్నియామకం చేసిన  రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.  ఆచార్యునిగా తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానన్నారు. ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌నియామకాన్ని విభాగ ఆచార్యులు స్వాగతించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆచార్య క్రిష్ణమోహన్‌ను కామర్స్‌మేనేజ్‌మెంట్‌ ‌విభాగాధిపతి ఆచార్య సి.వి కన్నాజిరావు, విభాగ ఆచార్యులు బి.మోహన వెంకట రామ్‌, ఆచార్య జాలాది రవి, ఏయూఇయూ అద్యక్షులు డాక్టర్‌ ‌జి.రవికుమార్‌, ‌గెస్ట్‌హౌస్‌ ‌డీన్‌ ఆచార్య టి.షారోన్‌ ‌రాజు తదితరులు ఆచార్య క్రిష్ణమోహన్‌ను అభినందించారు.