ఎరువుల అమ్మకానికి లైసెన్స్-ఈవో..
Ens Balu
2
తిరుమల
2020-11-04 19:58:35
భూమిలో కుళ్లిపోయే వ్యర్థ పదార్థాల నుండి ఎరువును తయారు చేస్తున్నామన్నారు టిటిడి ఈవో డా.కె.ఎస్.జవహర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, ఈ రకంగా తయారైన ఆరు వేల టన్నుల ఎరువును టిటిడి వేలం ద్వారా విక్రయించడానికి అవసరమైన లైసెన్స్ బుధవారం (ఈ రోజు) మంజూరు అయిందన్నారు. భూమిలో కుళ్ళని వ్యర్థ పదార్థాలను విభజించి ప్యాకింగ్తో తిరుపతికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. వీటిపై మరింత మంది నిపుణుల నుండి సలహాలు తీసుకుంటామన్నారు. మురుగు నీటిని శుభ్రపరిచి ఉద్యానవనాలకు ఉపయోగిస్తున్నారని, ఈ నీటిని మరుగుదొడ్ల అవసరాలకు కూడా వాడే అవకాశాన్ని పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. దీని వల్ల తిరుమలలో నీటి వినియోగాన్ని కొంత మేరకు తగ్గించవచ్చని ఈవో వివరించారు. కార్యక్రమంలో సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సిఇ రమేష్రెడ్డి, ఎస్ ఇ -2 నాగేశ్వరరావు, ఆరోగ్య అధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, విజివో మనోహర్, సిఎంవో డా.నర్మద ఈ పర్యటనలో పాల్గొన్నారు.