విశాఖజిల్లా నాలుగు జిల్లాలు కానుందా..?
Ens Balu
4
Visakhapatnam
2020-11-05 07:34:44
రాష్ట్రప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తే విశాఖజిల్లాను నాలుగు జిల్లాలుగా చేస్తుందానే అనే అంశంపై చురుకుగా చర్చ జరుగుతోంది. విశాఖ జీవిఎంసి పరిధి మొత్తం ఒక జిల్లా, ఏజెన్సీ 11 మండలాలు మరో జిల్లా, రూరల్ మైదాన మండలాలు మొత్తం ఒక జిల్లా, అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు విజయనగరంలోని కొన్ని మండలాలతో మరోజిల్లా ఏర్పాటు కానుందని తెలుస్తుంది. అలా కాకుండా ప్రభుత్వ పాలసీ ప్రకారం అయితే అనకాపల్లి, విశాఖపట్నం, అరకు పార్లమెంటు నియోజవర్గాల పరిధిలను మూడు జిల్లాలుగా చేయాలి. అందులోనూ అనకాపల్లిని కాకుండా, నర్సీపట్నం ప్రాంతాన్ని జిల్లాగ ప్రకటించి, దానికి విన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనేది ఈ ప్రాంతీయుల చిరకాల వాంచ. పైగా క్రిష్ణదేవిపేట ప్రాంతంలో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కాకముందే సుమారు 5ఏళ్లు పైగా కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాలన సాగింది. అదీ అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికే ఈ ప్రాంతంలో ఆయనను అప్పటి మద్రాసు ప్రావిన్సు ప్రభుత్వం నియమించింది. దానికి తోడు అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలకు ధీటుగా నడిపిన సమాంతర పాలన రచ్చబండ అదే భారతదేశంలో కాలక్రమంలో పంచాయతీలుగా రూపాంతరం చెందింది. అంతేకాదు అల్లూరి బ్రిటీషు సేనలను ఎదుర్కోవడానికి నడిపిన మన్యం పితూరి ఉద్యమం కూడా క్రిష్ణదేవి పేట ప్రాంతం నుంచే ప్రారంభం అయ్యింది. అంతటి విశిష్ట చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా అధికారులు జిల్లాగా చేయాలని భావించినా..ఇక్క ప్రభుత్వ భవనాలు పూర్తిస్థాయిలో లేవనే ఒకే ఒక్క కారణంతో నర్సీపట్నం వేదికగా జిల్లా ప్రకటించాలనేదికూడా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం వున్న విశాఖజిల్లా మూడు, లేదా నాలుగు జిల్లాలుగా మారే అవకాశాలు పూర్తిస్థాయిలో కనిపిస్తున్నాయి...అయితే ప్రభుత్వ తీసుకునే నిర్ణయంపైనే ఎన్ని జిల్లాలుగా విశాఖజిల్లా మారబోతుందనేది ఆధారపడి వుంది..