పెన్షను దారుల ఆకలి కేకలు..


Ens Balu
3
విశాఖపట్నం
2020-11-05 10:43:35

ఆంధ్రప్రదేశ్ లో నవంబరు నెల పెన్షలు నేటికీ పించను దారుల అకౌంట్లలో పడలేదు. ప్రతీనెలా టంచనుగా 1వ తేదీనే పడిపోయే పెన్షన్లు ఈనెల 5వ తేదీ వచ్చినా నేటికీ పించన్లు పడలేదు. దీనితో పెన్షను దారులు ఖజానాశాఖకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. అందులోనూ చాలా మందికి ఆ పెన్షన్లమీదే ఆధారపడి జీవిస్తుండటం, కరోనా సమయంలో బయటకు వెళ్లే పరిస్థితిల లేకపోడంతో పెన్షను దారు స్థితి మరింత జటిలంగా మారింది. అయితే పెన్షను దారులకు ఎందుకు పించన్లు ఆలస్యమయ్యాయనే విషయంలో ఖజానా శాఖ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఎపుడైనా జీతాలుగానీ, పెన్షన్లుగానీ ఆలస్యమైతే ప్రభుత్వం ముందుగా సమాచారం అందించేది. ఈ నెల పెన్షను దారులకు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు, పెన్షన్లు కూడా 5వ తేది వచ్చినా నేటికి వారి బ్యాంకు ఖాతాలకు జమకాలేదు. దీనితో పెన్షను దారులు ప్రతీనెలా చెల్లించుకోవాల్సిన చెల్లింపులు, ఇంటి పనులు నిలిచిపోయాయి..ఈ విషయమై ఖజానాశాఖ డెప్యూటీ డైరెక్టర్ ను ఈఎన్ఎస్ సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు..