మాస్టర్ గా మారిన అనంత జిల్లా కలెక్టర్..
Ens Balu
4
Bukkarayasamudram
2020-11-05 13:17:24
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉపాధ్యాయుడిగా మారిపోయారు...బోర్డుపై లెటర్లు రాస్తూ పిల్లలకు వివరించారు...ఏం రాశారో వాటిని తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. గురువారం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలోని పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బోర్డుపై రాసి పిల్లలకు వివరించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ తమ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిగా మారి మరీ కరోనా కోసం జాగ్రత్తలు వివరించడం, అధికారులను, విద్యార్ధులను ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, కరోనా వలన చాలా కాలం పాఠశాలలకు దూరంగా ఉన్న మీరు పాఠశాలలు తెరిచిన తరువాత కూడా సామాజిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలన్నారు. కరోనా వైరస్ రెండవ దశ మొదలైన సందర్భంగా పిల్లలను మరింత జాగ్రత్త చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను కూడా ఆదేశించారు. ఏమాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా దగ్గర్లోని పీహెచ్సీకి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించాలని కూడా ఆదేశించారు. అనంతరం పాఠశాలను మొత్తం తనికీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్...