లైన్లో కంచం పట్టుకొని.. ఆపై అన్నం పెట్టుకొని..


Ens Balu
2
Bukkarayasamudram
2020-11-05 14:00:54

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు పెట్టే మధ్యాహ్నం భోజనం ఎలా వుందో తెలుసుకోవాలంటే స్వయంగా అక్కడ పెడుతున్న భోజనం రుచిచూస్తేనే వాస్తవం తెలుస్తుంది...అచ్చం అలానే చేశారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. గురువారం బుక్కరాయ సముద్రం పాఠశాలను సందర్శించిన ఆయన స్వయంగా విద్యార్ధులతోపాటు లైన్లో నిలబడే కంచం తెచ్చుకొని మరీ వారితో కలిసి మధ్యాహ్నాం భోజనాన్ని రుచిచూశారు. విద్యార్ధులతో కలిసి బెంచిపై కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో మాట్లాడుతూ, ప్రతీరోజు అన్నం ఎలా పెడుతున్నారని, కూరలు ఎలా వుంటున్నాయని, మంచినీరు స్వచ్ఛంగా వుంటుందా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్ధులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్ధులంతా బాగా చదువుకోవాలని సూచించిన కలెక్టర్, ఆదిశగా విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు వచ్చేవిధంగా తయారు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.