గడువులోగా సమస్యలు పరిష్కరించాలి..
Ens Balu
2
Hindupuram
2020-11-05 17:33:23
సచివాలయానికి వచ్చే సర్వీసులను గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం హిందూపురం లోని రహ్మత్ పురం (16వ వార్డులోని 1వ) సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, ఒక్క సర్వీసును కూడా పెండింగ్ లో ఉంచరాదన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని, ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ సేవల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సచివాలయ సేవలు ఎలా అందుతున్నాయో అరా తీశారు. అనంతరం సచివాలయానికి ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల పోస్టర్ లను, లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, తహసీల్దార్ శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.