మద్యపాన నిషేదానికి ప్రతీఒక్కరూ సహకరించాలి..కలెక్టర్


Ens Balu
3
Visakhapatnam
2020-07-25 20:19:02

మద్యం రహిత సమాజ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మేరకు, విశాఖ జిల్లా అధికారులు అందరూ దృఢ సంకల్పంతో ఉన్నామని తెలిపేరు. "నషా ముక్త్ భారత్" కి తగిన సహకారాలను అందిస్తామనీ, సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపేరు. మధ్య దుకాణాల రద్దీ నియంత్రించేందుకు కరోనా మహమ్మారి నేపధ్యం లో మొండికేస్తున్న మందు బాబులను నిబంధన ప్రకారమే మద్యం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసేమని అన్నారు.  పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ  పెరుగు తున్నందున తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  అన్ని మద్యం షాపు ల దగ్గర ప్రత్యేకంగా బారికేడ్లను నిర్మించి వీలైనంత తొందరగా దుకాణం నుంచి మధు ప్రియులను పంపించే ఏర్పాట్లను చేసేమని అన్నారు. ఈ కౌంటర్ల వ్యవస్థ రాష్ట్రం లోనే మొదటి సారిగా విశాఖ లో అమలు పరిచినట్టు తెలిపేరు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, GVMC, ఎక్సైజ్, డాక్టర్ల బృందంతో,  కరోనా కట్టిడికై,  24/7 జిల్లా యంత్రాంగము కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్య క్రమంలో మద్య విమోచన ప్రచార కర్తలు సురేష్ బేతా,  సైకాలజిస్ట్ డాక్టర్. జయలక్ష్మీ దిట్టకవి, చరిత్ పాల్గొన్నారు.
సిఫార్సు