సంకల్పయాత్ర ప్రజల కష్టాలు తీరుస్తోంది..
Ens Balu
3
ఉత్తర నియోజకవర్గం
2020-11-07 16:16:24
సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి పాదయాత్రతోనే ప్రజల కష్టాలు చూసి ప్రజోపయోగ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విశాఖలోని ఉత్తర నియోజకవర్గ పరిధిలోని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు చేస్తున్న పాదయాత్ర 43, 44 వార్డుల్లో కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహానేత ఆశయసాధను పేదల అభివ్రుద్ధికి దేశంలోనే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందిన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నెల 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు 10 రోజులు పాటు నియోజకవర్గ పాదయాత్ర చేస్తున్న నేపధ్యంలో వార్డులో బానాల శ్రీనివాస్, పి.ఉషశ్రీ ఆధ్వర్యంలో దాడిరమణమూర్తి కళ్యాణమండపం, శ్రీనివాసనగర్,80ఫీట్ రోడ్డు, ఎంటీసీ పాలెం ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. అనంతరం సాది ఖాన కళ్యాణమండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ, ఎన్నికలు ముందు మేనిపెస్టోలో పొందు పోరిచిన విదంగా 90% సంక్షేమ పథకాలు సంవత్సరం నర కాలంలో అమలుచేసి ఘనత ఒక్క వై.యస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే దక్కిందని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం గారు,పార్టీ సీనియర్ నాయకులు భరణికాన రామారావు గారు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అభ్యర్థులు,వార్డు అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.