రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలి..
Ens Balu
3
జీవిఎంసీ గాంధీవిగ్రహం
2020-11-07 18:34:04
సంస్కృతి సంప్రదాయాలకు పేరుగాంచిన భారత్ లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు దురదృష్టకరమని జీవీఎంసీ 15వ వార్డు బీజేపి కార్పొరేటర్ అభ్యర్థి డా.మల్లీశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రిప్ సొసైటీ పేరిట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ రోజు రోజు కి మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఇటీవల గాజువాకలో వరలక్ష్మి అనే అమ్మాయిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేయడంతో నగరాల్లో అమ్మాయిలకు రక్షణలేకుండా పోతుందనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు దిలీప్ రుద్రరాజు, ప్రసాద్, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.