లోక్ అదాలత్ తో435 కేసులు పరిష్కారం..
Ens Balu
2
శ్రీకాకుళం
2020-11-07 20:43:43
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా 435 కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపారు. శనివారం, జిల్లాలోని అన్ని కోర్టులలోను వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందు నిమిత్తం 15 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. రూ. 1,68,72,016 లతో 435 కేసులను పరిష్కరించగా, ఇందులో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు 117, ఎక్సైజ్ కేసులు 229, మోటారు యాక్సిడెంట్ కేసులు 17, ఎస్.టి.సి.లు 09, అడ్మిషన్లు 34, సివిల్ కేసులు 29 వున్నట్లు తెలిపారు. కాగా మైక్రో లెవెల్ లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని ఈ నెల 9 వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఉదయం 9 గం.లకు మైక్రో లెవెల్ లీగల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.