అధికారులు స్పందించకపోతే చర్యలు తప్పవు..


Ens Balu
2
జివిఎంసి కార్యాలయం
2020-11-09 18:14:54

డయల్ యువర్ కమిషన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అధికారులు శాఖల వారీగా పరిష్కరించాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు.  సోమవారం జివిఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, ఏ లక్ష్యంతో అయితే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామో దానిని అధికారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. అదే సమయంలో ఫిర్యాదులపై స్పందించని అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఈరోజు  ఒకటవ జోనుకు 03, రెండవ జోనుకు 05, మూడవ జోనుకు 06, నాల్గవ జోనుకు 06, అయిదవ జోనుకు 03, ఆరవ జోనుకు 07, ఏడవ(అనకాపల్లి) జోనుకు 01, మొత్తము 31 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాసరావు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, సి.ఎం.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, ఏ.డి.హెచ్ దామోదర రావు, డి.ఇ.ఓ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.